వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దోశలు వేసి, టీ విక్రయించిన టీడీపీ ఎంపీ మాగంటి!
భద్రాద్రి: ఏలూరు ఎంపీ మాగంటి బాబు అశ్వారావుపేటలో పర్యటన చేసి సరదాగా గడిపారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు నుంచి సాయంత్రం 5గంటలకు అశ్వారావుపేటకు వచ్చిన ఆయన పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్కు వెళ్లారు.
అక్కడ కొద్దిసేపు దోశలు వేశారు. అనంతరం ఇడ్లీ, దోశలు విక్రయించారు. ఆ పక్కనే ఉన్న టీ దుకాణం వద్దకు వెళ్లి టీ విక్రయించారు. సమాచారం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా తరచూ ఇటు వైపు వస్తూ ఉంటానని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ, పార్టీ ఉపాధ్యక్షుడు ఎం. రాజమోహన్రెడ్డి పలువురు నేతలు ఉన్నారు.
Comments
English summary
Telugudesam MP Maganti Babu on Tuesday made a Dosa and sell tea in Aswaraopeta in Badradri district.
Story first published: Wednesday, December 6, 2017, 0:21 [IST]