టిడిపిలోకి మాగుంట, కలిసిన రాఘవేంద్రరావు (పిక్చర్స్)
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
ఆయనతో పాటు దర్శి నియోజకవర్గ నేతలు వాయల మోహన్ రావు, శ్రీనివాస రెడ్డి, సూపర్ బజార్ చైర్మన్ తాతాప్రసాద్, కాంగ్రెస్ మహిళా నేత నాలమ్ నరసమ్మ పసుపు పచ్చ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా పార్లమెటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ద్వారానే సీమంధ్ర పునర్నిర్మాణం సాధ్యమని చెప్పారు. కాగా, చంద్రబాబును దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కలిశారు.
టిడిపి
కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
టిడిపి
ఆయనతో పాటు దర్శి నియోజకవర్గ నేతలు వాయల మోహన్ రావు, శ్రీనివాస రెడ్డి, సూపర్ బజార్ చైర్మన్ తాతాప్రసాద్, కాంగ్రెస్ మహిళా నేత నాలమ్ నరసమ్మ పసుపు పచ్చ కండువా కప్పుకున్నారు.
టిడిపి
ఈ సందర్భంగా పార్లమెటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ద్వారానే సీమంధ్ర పునర్నిర్మాణం సాధ్యమని చెప్పారు.
రాఘవేంద్ర రావు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ దర్శకులు రాఘవేంద్ర రావు బుధవారం కలుసుకున్నారు.
టిడిపి
కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో ఉండాలా వద్దా అని సందిగ్దంలో పడ్డానని, ఆ సమయంలో చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.
టిడిపి
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు సూచించారన్నారు. టిడిపి-బిజెపి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని మాగుంట వెల్లడించారు.