వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీ గౌతమి హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన సందీప్‌, దుర్గాప్రసాద్‌లను పాలకొల్లు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

తొలుత పోలీసులు ఈ కేసును ప్రమాదంగా భావించగా అనంతరం సిఐడి విచారణలో హత్యగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రాధమికంగా మొత్తం ఎనిమిది మందికి ఈ హత్యలో ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్‌, దుర్గాప్రసాద్‌ల బెయిల్‌ రద్దు చేసి అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు.

 Main accused were arrested in Shri Gouthami Murder case

ఆ మేరకు పాలకొల్లు పోలీసులు వీరిరువురును విశాఖపట్నంలో అరెస్టు చేసినట్లు తెలిసింది. సీఐడీ దర్యాప్తుతో గౌతమిది హత్యాగా తేలడంతో ఆమె కేసు రీఓపెన్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్‌లుగా కేసులో మార్పులు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే శ్రీ గౌతమి హత్య కేసులో కీలక నిందితుల్లో ఒకరైన డ్రైవర్‌ లక్ష్మణ రావును అదుపులోకి తీసుకొని శుక్రవారం కోర్టులో హజరుపరిచారు. హత్య జరిగిన రోజు హంతకులతో పాటు ఇతడు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. శ్రీ గౌతమి, పావనిలు నడిపే టూవీలర్‌ను హంతకులకు చూపి, ఫొటోలను అందించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 26న కూడా నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

English summary
East Godavari:Police have arrested main accused in the sensational murder case of Shri Gouthami. The main accused, Sandeep and Durga Prasad, was arrested by the Palakollu police on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X