వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు మూడ్రోజుల కాల్షీట్లు ఇచ్చారు, బాబు సమాధానం చెప్పు: మల్లాది విష్ణు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వివాదాలను పక్కదోవ పట్టించేందుకే మంత్రి నారా లోకేష్ ఆస్తుల ప్రకటన చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు శుక్రవారం విమర్శించారు. ఆయన ఆస్తులు ప్రకటించిన ఈ డిసెంబర్ 8వ తేదీని అసత్య దినోత్సవంగా జరుపుకోవాలని ఎద్దేవా చేశారు.

Recommended Video

Pawan Kalyan Tour : Pawan Kalyan About His Clash With Paritala Ravi

వారసత్వంపై పవన్ కళ్యాణ్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ ఆస్తుల ప్రకటనపై సెటైర్వారసత్వంపై పవన్ కళ్యాణ్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ ఆస్తుల ప్రకటనపై సెటైర్

ఆస్తుల వివరాలు సభాపతికి సీల్డు కవర్‌లో ఇస్తారని చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి ఆస్తుల వివరాలు ప్రకటించాల్సిన అవసరం ఏముందని చెప్పారు. లోకేష్ ప్రకటించిన ఆస్తులకు రెండింతలు ఇస్తే వాటిని తమకు ఇస్తారా అని సవాల్ చేశారు. జగన్‌కు సంబంధించిన ఆస్తుల కేసు కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.

Malladi Vishnu fires at Chandrababu Naidu and Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఆంధ్రా ప్రజలకు కాల్షీట్లు ఇచ్చారని మల్లాది ఎద్దేవా చేశారు. 2014లో ఏ వ్యక్తి అయితే టీడీపీకి మద్దతు ఇచ్చారో ఇప్పుడు అదే వ్యక్తి పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. మొదట దానికి సమాధానం చెప్పాలన్నారు.

English summary
YSR Congress Party leader Malladi Vishnu fires at AP CM Nara Chandrababu Naidu and Jana Sena party chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X