వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, మోడీ మోసం చేశారు! అలా చేస్తే హోదా వచ్చేది: మల్లాది విష్ణు ఫైర్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ.. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఉద్యమంలో టీడీపీ కూడా భాగస్వామి కావాలని అన్నారు.

హోదా అలా వస్తుంది

హోదా అలా వస్తుంది

టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని, ఏపీలో ఉన్న 25మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తే ఖచ్ఛితంగా ప్రత్యేక హోదా వస్తుందని మల్లాది విష్ణు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జులై 24న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

మోడీ, బాబు మోసం చేశారు

మోడీ, బాబు మోసం చేశారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేశారని అన్నారు. మోడీ పార్లమెంటు సాక్షిగా హోదా విషయంలో మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని విమర్శించారు.

జగన్ ఒక్కరే..

జగన్ ఒక్కరే..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మొదటి నుంచి చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని మల్లాది చెప్పారు. అవిశ్వాసం సందర్భంగా టీడీపీ, బీజేపీ చేసిన ద్రోహానికి నిరసనగా రేపు(జులై 24న) బంద్‌కు జగన్ పిలుపునిచ్చారని, మంగళవారం నాటి బంద్‌లో ప్రజలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొనాలని కోరారు.

హోదా వస్తేనే..

హోదా వస్తేనే..

హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, దీంతో యువతకు ఉద్యోగాలు వస్తాయని మల్లాది చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా తాము మద్దతిచ్చామని, అలాగే భవిష్యత‌లో కూడా మద్దతు ఇస్తామని తెలిపారు.

English summary
YSRCP leader Malladi Vihnu on Monday fired at AP CM Chandrababu Naidu and PM Narendra Modi for Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X