వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను వదిలేసి వచ్చిన కూతురిపై తండ్రీకొడుకులు రేప్: కజిన్ కూడా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వావివరుసలు మరిచి తండ్రీకొడుకులు ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వావివరుసలు మరిచి తండ్రీకొడుకులు ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెపై అత్యాచారం చేశారు. కజిన్ కూడా ఆమెను వదిలి పెట్టలేదు.

తన 24 ఏళ్ల వయస్సు గల కూతురిపై 45 ఏళ్ల తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.తండ్రి మాత్రమే కాకుండా సోదరుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఓ కజిన్ కూడా అఘాయిత్యం చేశాడని చెప్పారు.

బాధితురాలు భర్తతో విడిపోయి నెల్లూరులోని తన పుట్టింట్లో ఉంటుంది. అది జరిగిన తర్వాత ఆమె తండ్రి రెండు వివాహాలు చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు.

ఆ తర్వాత...

ఆ తర్వాత...

బాధితురాలు విజయనగరంలోని తన సమీప బంధువు ఇంట్లో ఉంటూ వచ్చింది. తండ్రి, సోదరులు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఏడాది క్రితం కూతురిని తండ్రి విశాఖపట్నం తీసుకుని వచ్చాడు. వారు గార్డెన్ ఏరియా ప్రాంతంలో నివసిస్తూ వచ్చారు. తనను తండ్రి, సోదరుడు, కజిన్ రేప్ చేశారని ఆమె విశాఖ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేంద్ర ప్రభుత్వోద్యోగి...

కేంద్ర ప్రభుత్వోద్యోగి...

ప్రధాన నిందితుడు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. మరో నిందితుడు బిటెక్ గ్రాడ్యుయేట్. ముగ్గురిపై తాము కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఫిర్యాదు అందుకున్న తర్వాత పోలీసులు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహంచారు.

తాగేసి రేప్...

తాగేసి రేప్...

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూతురిపై తండ్రి పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సోదరుడు, కజిన్ చిత్తుగా మద్యం తాగి ఆమెపై అత్యాచారం చేసినట్లు చెబుతున్నారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితులు హెచ్చరించడంతో చాలా రోజులు బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.

సవతి తల్లికి తెలుసా....

సవతి తల్లికి తెలుసా....

వ్యవహారమంతా బాధితురాలి సవతి తల్లికి తెలుసా, లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

English summary
Visakhapatnam Two-Town police on Friday registered a case against a 45-year-old man on charges of raping his 24-year-old daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X