వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019లో చంద్రబాబు అధికారంలోకి రావాలని మోకాళ్ళతో కొండపైకి

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబు మళ్ళీ అధికారం లోకి రావాలని మోకాళ్ళ తో కొండపైకి

గుంటూరు: 2019 లో అంతా మంచి జరగాలని, చంద్రబాబు మళ్ళా అధికారం లోకి వచ్చి సీఎం కావాలని, అలాగే అమరావతి సుభిక్షం గా ఉండాలని కోరుతూ ఓ వ్యక్తి మోకాళ్లపై మంగళగిరి కొండ మెట్లు ఎక్కాడు. 2007 నుండి ఎప్పటికే చంద్రబాబు అధికారం లో ఉండాలని కోరుకుంటూ 40 వ కొండ గా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మి నరసింహ స్వామి కొండ మెట్లు ఎక్కాడు.

నల్లగొండ జిల్లా కు చెందిన సోలిపురం ఏసుదేవ రెడ్డి ఈ రోజు ఉదయం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఎగువ సన్నిధి లో గల 347 మెట్లు మోకాళ్ళ పై ఎక్కారు.

Man prays God in different way wishing Chandrababu's victory

చంద్రబాబు పాలన అంతా మంచిగా జరగాలని, అమరావతి నిర్మాణం బాగుండాలని, పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షం గా ఉండాలని కొండ పై స్వామీ వారిని కోరుకున్నామని ఏసుదేవ రెడ్డి తెలిపారు.

అదేవిధం గా మంగళగిరి నియోజకవర్గం లో టీడీపీ తరపున పోటీ చేయనున్న గంజి చిరంజీవి గెలుపు సాధించాలని, చంద్రబాబు కు మద్దతుగా అన్ని నియోజక వర్గాలలో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు విజయం సాధించాలని ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఏసుదేవ రెడ్డి అన్నారు.

English summary
Yesudeva Reddy has climbed Manglagiri hill o knees parying Andhra Pradesh CM Nara Chandrababu Naidu's victory in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X