సీఎం జగన్ పై మంచు లక్ష్మీ కామెంట్ - ఆడుకుంటున్న వైసీపీ ఫ్యాన్స్ ..!!
Manchu Lakshmi: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన మంచులక్ష్మీ పోస్టు చేసిన ఒకే ఒక్క పదం ఇప్పుడు వివాదంగా మారింది. ఎప్పుడూ కాంట్రావర్సీలకు దూరంగా ఉండే మంచు లక్ష్మీ పైన ఇప్పుడు జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన కొందరు చేస్తున్న ట్రోలింగ్ కు మంచు లక్ష్మి స్పందించారు. ఇది జగన్ అభిమానులకు రుచించలేదు. దీంతో, ఇప్పుడు మంచు లక్ష్మి పోస్టు చేసిన ఆ ఒక్క పదం పైన ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. జగన్ తో మంచు కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మరీ పోస్టింగ్ లు పెడుతున్నారు.
సీఎం వీడియో పై మంచు లక్ష్మి స్పందన
ఇప్పటం గ్రామస్థులతో జనసేన అధినేత పవన్ సమావేశమైన సమయంలో ముఖ్యమంత్రి జగన్ పేరు పరోక్షంగా ప్రస్తావిస్తూ సీఎం జగన్ నవ్వుకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. సమయం, సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటారని ఆయన ఎద్దేవా చేసారు. జగన్ ఎలా నవ్వుతారో పవన్ తన హావభావాలతో ఆ ప్రసంగంలో వివరించారు. దీంతో, ముఖ్యమంత్రి నవ్వుకు సంబంధించి కొందరు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. అందులో భాగంగా.. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం జగన్ నవ్వుతున్న సందర్భం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పరీక్ష గదిలో ప్రశ్నపత్రాన్ని చూసిన తర్వాత నా ముఖ చిత్రం'' అని క్యాప్షన్ తో దీనిని సర్క్యులేట్ చేస్తున్నారు.
మంచు లక్ష్మి కామెంట్ తో ఆగ్రహం
ఈ వీడియో పై మంచు లక్ష్మీ స్పందించారు. ఈ వీడియోకు రిప్లై ఇచ్చారు. 'లోల్' అని స్పందించారు. దీంతో, కొంత మంది జగన్ అభిమానులతో పాటుగా నెటిజెన్లు స్పందించారు. వైఎస్సార్ హయాం నంచి మోహన్ బాబు కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీలో చేరి పార్టీకి మద్దతుగా ప్రచారం చేసారు. జగన్ సీఎం అయిన తరువాత మోహన్ బాబు.. సీఎం ను కలవలేదు. కొంత దూరం పాటిస్తున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీకి జగన్ కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. ఈ సమయంలో జగన్ పైన పోస్టు అవుతున్న వీడియోలకు మంచు లక్ష్మి స్పందించటం సీఎం ను అభిమానించే వారికి నచ్చలేదు. దీంతో వారు స్పందిస్తున్నారు.
సీరియస్ గా రియాక్ట్ అవుతున్న నెటిజెన్లు
కొందరు నెటిజెన్లు మంచు లక్ష్మి చేసిన 'లోల్' కామెంట్ కు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. లక్ష్మీ మంచు పోస్ట్ కింద నెటిజన్స్ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. 'జగన్ అన్న అనవసరంగా చేరదీశాడు మిమ్మల్ని. జగన్ అన్ననే ట్రోల్ చేస్తావా'' అని ఓ నెటిజన్ స్పందించారు. దీనికి కొనసాగింపుగా మరో నెటిజన్ మరో పోస్టింగ్ చేసారు. అందులో.. 'జగన్ అన్న అనవసరంగా చేరదీశాడు మిమ్మల్ని. జగన్ అన్ననే ట్రోల్ చేస్తావా'' అని ఓ నెటిజన్ తెలిపారు. ''ఇంక మీ సినిమాలు ఏపీలో రిలీజ్ చేసినట్టే.. అసలే కాలేజేస్కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అని పెద్దాయన వర్రీ అయిపోతున్నారు'.. అంటూ కామెంట్ చేసారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.