వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వచ్ఛభారత్: చీపుళ్లతో మంచు లక్ష్మీ, మనోజ్(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం వల్ల దేశం బాగుపడుతుందంటే అందుకు తమ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని మనోజ్ తెలిపారు.

Manchu Laxmi and Manoj participates swachh bharat

అయితే ప్రచార ఆర్భాటాల కోసం మాత్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవద్దని రాజకీయ, సినీ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్, సినిమా హీరోలు అంతా కలిసి ప్రతిచోటా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటామని మనోజ్ చెప్పారు.

Manchu Laxmi and Manoj participates swachh bharat

ఇది ఇలా ఉండగా మంచు మనోజ్ సోదరి, సినీ నటి మంచు లక్ష్మి ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఫిల్మ్‌నగర్ బస్తీ రోడ్లతోపాటు, ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఆమె స్వచ్ఛ భారత్ నిర్వహించారు.

English summary
Actress Manchu Laxmi and actor Manoj participated in swachh bharat in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X