వైసీపీకి మంచు ఫ్యామిలీ వన్ ప్లస్ వన్ ఆఫర్ !? రంగంలోకి దిగిన యువ హీరో !
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ తరఫున ప్రచారంలో మంచు కుటుంబం దూకుడు చూపిస్తుంది. మోహన్ బాబు ఎన్నికల ప్రచారంలో తన మాటల దాడితో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెడుతుంటే , ఇక తండ్రికి తోడుగా జగన్ కు బాసటగా మంచు విష్ణు సైతం వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న చిరంజీవి .. ఎవరి కోసమో తెలుసా
తండ్రితో పాటుగా మోహన్ బాబు తనయుడి ప్రచారం .. వైఎస్ గొప్పతనం చెప్తున్న మంచు విష్ణు
వైసీపీ లో చేరక ముందే మంచు విష్ణు భార్య విరానికా జగన్ నా అన్న , నా రక్తం అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ కే తమ కుటుంబం మద్దతు అంటూ ప్రకటించింది. ఇక ఆ తర్వాత మోహన్ బాబు వైసీపీ లో చేరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ కు మద్దతుగా మోహన్ బాబు మాత్రమే కాదు తనయుడు మంచు విష్ణు సైతం ప్రచారం చేస్తున్నారు. శత్రువులకు కూడా సాయం చేసే గుణం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని నటుడు మంచు విష్ణు అన్నారు. మంగళవారం ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రామిరెడ్డిపల్లి గ్రామంలో పంచాయతీ రచ్చబండ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. జగన్ కు ఓటెయ్యాలని గ్రామస్తులను కోరారు మంచు విష్ణు .
చంద్రబాబు కక్ష పూరితంగా తమను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్య .. చంద్రబాబు పాలనలో ఏ మేలు లేదన్న విష్ణు
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడారు. తమ కుటుంబానికి రాజకీయాలపై ఆసక్తి లేదన్న మంచు విష్ణు తన తండ్రి విద్యాసంస్థల ద్వారా 27ఏళ్లుగా పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి రావా ల్సిన రూ.19కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా, ఇబ్బందులకు గురి చేశారన్నారు. చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పనిచేసినా నియోజకవర్గానికి, ప్రాంతానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో జరిగిన మేలు ఏమి లేదని మంచు విష్ణు పేర్కొన్నారు.
శత్రువులకు సైతం సాయం చేసిన గొప్ప గుణం వైఎస్ ది.. జగన్ కు ఓటెయ్యండి అని విష్ణు పిలుపు
శ్రీవిద్యానికేతన్ను నెలకొల్పి చుట్టుపక్కల ఉన్న సుమారు రెండువేల మందికి మోహన్బాబు ఉపాధి కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎంతమందికి ఉపాధి కల్పిం చారో ఆలోచించాలని సూచించారు. వైఎస్ హయాంలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని చెప్పారు మంచు విష్ణు . శత్రువుకు సైతం సాయం చేసే గొప్ప గుణం వైఎస్ఆర్ ది అని కొనియాడిన విష్ణు మళ్లీ అలాంటి పాలన రావాలంటే ఆయన తనయుడు జగన్ ని గెలిపించాలని కోరారు.