వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బియాస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు: హైకోర్టు

|
Google Oneindia TeluguNews

సిమ్లా/హైదరాబాద్: బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరి సగం చొప్పున చెల్లించాలని హైకోర్టు పేర్కొంది.

జులై 9 నాటికి కళాశాల యాజమాన్యం ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Mandi tragedy: Family of students who died to get Rs 5 lakh each

హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. జూన్ 8న ప్రమాదం జరగగా ఇప్పటికి 17 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి.

మరో ఏడుగురు విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
The Himachal Pradesh High Court on Wednesday ordered that the family of each student who died in the Mandi tragedy would get a compensation of Rs 5 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X