వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ వల్లే మాకు మంత్రి పదవులు, చిరంజీవి అందుకే ఓడారు: మంత్రి మాణిక్యాల రావు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ చొరవతోనే తమకు మంత్రి పదవులు వచ్చాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్పష్టం చేశారు. అనకాపల్లిలోని సత్యనారాయణమూర్తి దేవస్థానం వద్ద ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ విజయానికి పవన్‌కల్యాణ్ ఎంతో తోడ్పాటు అందజేశారని పేర్కొన్నారు. ఏ జాతిలో క్రమశిక్షణ తక్కువగా ఉందంటే అది కాపుజాతిలో మాత్రమేనని, కాపులైన రంగా హత్యను సాకుగా చూపి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని అన్నారు.

Manikyala Rao praises Pawan Kalyan

అంతేగాక, పాలకొల్లులో చిరంజీవి ఓటమికి కాపు కులస్తుల్లో క్రమశిక్షణ లేకపోవడమే కారణమని అన్నారు. రాజస్థాన్‌లో మెనా అనే కులస్తులు ఉన్నారని, వారిని బిసిల్లో చేర్చుకోవాలని 90 రోజులు రైల్వేలైన్లు, జాతీయ రహదారిని దిగ్బంధించారని ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు గుర్తు చేశారు.

ఈ ఘటనలతో ప్రభుత్వం దిగివచ్చిందని, ఉద్యమం చేస్తే అలా ఉండాలని చెప్పారు. అయితే, కాపుకులం కూడా రాష్ట్రంలో బలమైన శక్తి అని చిరంజీవి నిరూపించారని పేర్కొన్నారు. కాపులను బిసిలో చేర్చే ప్రయత్నం చేస్తున్నామని, ఇది సాధ్యమవుతుందన్న ఆశాభావాన్ని మంత్రి మాణిక్యాల రావు వ్యక్తం చేశారు.

English summary
Andhra Pradesh Minister Pydikondala Manikyala Rao on Sunday praised Janasena Party president and Cine Actor Pawan Kalyan for his help in elections campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X