హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రి చేతిలోంచి జారిపడి మూసీలో శవమై తేలిన పాప

By Pratap
|
Google Oneindia TeluguNews

Manvi
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోలు వద్ద మూసీ నదిలో తండ్రి చేతిలోంచి జారిపడి గల్లంతైన రెండేళ్ల చిన్నారి మాన్వీ శవమై తేలింది. ఆమె మృతదేహం శుక్రవారం ఉదయం మూసీలో లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం మర్రిపల్లి వంతెన వద్ద ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు మాన్వీ శవానికి బయటకు తీశాయి. గురువారం నదిలో జారిపడిన మాన్వీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఉప్పల్ సమీపంలోని పర్వతాపురానికి చెందిన చిమ్ముల బాల్ రెడ్డి, సరళ దంపతలు మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు మేఘశ్యాం రెడ్డి, ప్రతిభ దంపతులు లండన్‌లో ఉంటున్నారు. వీరికి ప్రమోగ్ రెడ్డి (10), సాన్వీ (5), మాన్వీ (2) పిల్లలు ఉన్నారు. మేఘశ్యాంరెడ్డి లండన్‌లో అనస్తీషియా స్పెషలిస్టు

నెల రోజు కిందట మేఘశ్యాంరెడ్డి కుటుంబ సభ్యులు నగరానికి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వచ్చారు. బుధవారం నాగార్జునసాగర్ వెళ్లారు. పిల్లలు ఇంట్లో గొడవ చేస్తుండడంతో కారులో తిరిగి వద్దామని మేఘశ్యాం రెడ్డి కుమారుడు అమోఘ్ రెడ్డి, చిన్న కూతురు మాన్విని తీసుకుని గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. భార్య ప్రతిభ, పెద్ద కూతురు సాన్వీని తీసుకుని ఓ పెళ్లికి వెళ్లింది.

నాగోలు వంతెన వద్దకు వచ్చిన తర్వాత మూసీనదిని చూద్దామని కుమారుడు అమోగ్ రెడ్డి తండ్రి మేఘశ్యాంరెడ్డిని కోరాడు. దాంతో కారును ఆపి కిందికి దిగారు. వంతెన ఫుట్‌పాత్‌పై కుమారుడు మూసీలోకి చూస్తుండగా మేఘశ్యాం రెడ్డి ఓ చేత్తో కూతురిని ఎత్తుకుని మరో చెత్తో కెమెరాతో ఫొటో తీయబోయాడు. ఈ క్రమంలో మాన్వీ మూసీలోకి తొంగి చూస్తూ ప్రమాదవశాత్తు జారిపడింది.

English summary
A 2 years girl Manvi, missed in the Musi river at Nagole in hyderabad, has found dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X