వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత నగేష్ హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: ఛత్తీస్‌గడ్-ఏపీ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్ట్‌లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కీలకనేత నగేశ్ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు సోమవారం సాయంత్రం వరకు కూడా సంఘటనా స్థలంలోనే ఉండి ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు మల్లంపేట ప్రాంతంలో ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మల్లంపేట ప్రాంతమే కాకుండా ఇతరప్రాంతాల్లో కూడా పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.

Maoist leader Nagesh killed in encounter

మృతి చెందిన మావోయిస్టును శబరి ఏరియా కమిటీ కమాండర్‌ నాగేష్‌గా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా స్పెషల్‌ పోలీస్‌ పార్టీ బలగాలు ఏపీ, చత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా శబరి ఏరియా కమిటీ తారస పడింది.

దాంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో శబరి ఏరియా కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న నగేష్‌ హతం కాగా కొంతమంది దళ సభ్యులు పారిపోయినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాశ్‌ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు.

English summary
Maoist Nagesh killed in an encounter in East Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X