ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత నగేష్ హతం
కాకినాడ: ఛత్తీస్గడ్-ఏపీ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్ట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలకనేత నగేశ్ మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు సోమవారం సాయంత్రం వరకు కూడా సంఘటనా స్థలంలోనే ఉండి ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు మల్లంపేట ప్రాంతంలో ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మల్లంపేట ప్రాంతమే కాకుండా ఇతరప్రాంతాల్లో కూడా పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.
మృతి చెందిన మావోయిస్టును శబరి ఏరియా కమిటీ కమాండర్ నాగేష్గా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ పోలీస్ పార్టీ బలగాలు ఏపీ, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా శబరి ఏరియా కమిటీ తారస పడింది.
దాంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో శబరి ఏరియా కమిటీకి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న నగేష్ హతం కాగా కొంతమంది దళ సభ్యులు పారిపోయినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాశ్ ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు.