షాకింగ్ యాక్సిడెంట్: వంతెన పైనుంచి కిందపడ్డ కారు, ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా కాకాని సమీపంలోని బుడంపాడు రైల్వే బ్రిడ్జి వద్ద జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
కాకాని: వేగంగా ప్రయాణిస్తోన్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి, రైల్వే వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
గుంటూరు
జిల్లా
కాకాని
సమీపంలో
శనివారం
మధ్యాహ్నం
ఈ
ప్రమాదం
జరిగింది.
మృతులు
బెంగళూరుకు
చెందిన
ఫొటోగ్రాఫర్లు,
వీడియోగ్రాఫర్లుగా
పోలీసులు
గుర్తించారు.
బెంగళూరుకు
చెందిన
నలుగురు
పశ్చిమగోదావరి
జిల్లా
భీమవరంలో
జరిగిన
ఓ
వివాహానికి
హాజరై,
తిరిగి
స్వస్థలానికి
వెళుతుండగా
ప్రమాదంలో
చిక్కుకున్నారు.
వారు ప్రయాణిస్తున్న కారు సరిగ్గా బుడంపాడు రైల్వే బ్రిడ్జి వద్ద డివైడర్ను ఢీకొట్టింది. అదే వేగంతో బ్రిడ్జిపై నుంచి 30 అడుగుల కిందకు పడిపోయింది. ఈ ఘటనలో కారులోని ఒకరు అక్కడికక్కడే మరణించారు.
మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించగా, ఒకరు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు మృతుల కుటుంబీకులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.