రామోజీ ఇంట శుభకార్యానికి పవన్, జగన్.. అరుదైన కాంబినేషన్?
మీడియా మొఘల్ రామోజీరావు మనువరాలి వివాహం ఇందుకు వేదిక కాబోతుండగా.. ఆ అరుదైన కాంబినేషన్ జగన్-పవన్ అని చెబుతున్నారు.
హైదరాబాద్: కొన్ని అరుదైన కాంబినేషన్లు అరుదుగా మాత్రమే మీడియా కెమెరాలకు చిక్కుతుంటాయి. అలాంటి అరుదైన కాంబినేషన్ ఒకటి త్వరలోనే ఒకే వేదిక మీద కనిపించే సందర్భం రాబోతోంది. మీడియా మొఘల్ రామోజీరావు మనుమరాలి వివాహం ఇందుకు వేదిక కాబోతుండగా.. ఆ అరుదైన కాంబినేషన్ జగన్-పవన్ అని చెబుతున్నారు.
వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికగా కలిసిన సందర్భాలు అసలు లేవనే చెప్పాలి. రామోజీరావు ఇంట పెళ్లి సందర్భంగా వీరిద్దరూ హాజరయ్యే అవకాశం ఉండటంతో.. ఓ అరుదైన కాంబినేషన్కు ఈ పెళ్లి వేదికగా నిలవబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మీడియా మొఘల్ ఇంట పెళ్లంటే.. సహజంగానే దేశవ్యాప్తంగా చాలా రంగాలకు సంబంధించిన ప్రముఖులంతా హాజరవుతారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ పెళ్లిలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశముంది.
ఇదిలా ఉంటే, రామోజీ మనుమరాలి పెళ్లి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో ఈ నెల 28వ తేదీ అర్థరాత్రి 12గం.కు మేష లగ్నంలో వివాహం జరగనుంది. అంతకు కొద్ది గంటల ముందే రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు.