కోలార్ దాడి: గాయపడ్డ పాలమూరు వైద్య విద్యార్థి మృతి
అతని పైన గత వారం కొందరు దుండగులు పెట్రోలు పోసీ నిప్పు అంటించారు. తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సాయి ప్రసాద్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కామేష్కు శరీరం డెబ్బై శాతం కాలిపోయింది. దీంతో అతనిని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చర్పించారు.
గాయాలు తీవ్రం కావడంతో మూత్రపిండాలు పని చేయకపోవడంతో వైద్యులు కామేష్కు డయాలసిస్ నిర్వహించారు. కృత్రిమ శ్వాస కొనసాగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
కామేష్ ఈ నెల 12వ తేదీన రాత్రి పదిన్నర గంటలకు వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతని మెడలో గొలుసులు లాగేందుకు ప్రయత్నంచారు. ప్రతిఘటించడంతో పెట్రోలు పోసి నిప్పు అంటించి పరారయ్యారు.
కామేష్ తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మలు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. లక్ష్మణ శర్మ కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా జ్యోతి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు.