చిరంజీవి జోలికొస్తే ఖబడ్దార్... మెగాస్టార్ ఇంటి వద్ద మెగా ఫ్యాన్స్ హంగామా
రాజధాని అమరావతికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలకాలని నేడు చిరంజీవి ఇంటి ముందు ధర్నా చెయ్యాలని యువసేన జేఏసీ నిర్ణయం తీసుకుంది. మరోపక్క ధర్నా విరమించుకున్నామని అమరావతి జేఏసీ ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా ధర్నా చేస్తే మాకు సంబంధం లేదని కూడా అమరావతి జేఏసీ ప్రకటన చేసింది. ఈ గందరగోళం మధ్య పోలీసులు మెగాస్టార్ ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటె ఇక రాజధాని సెగ తమ అభిమాన హీరో చిరంజీవికి తగలకుండా కాపాడుకుంటామంటున్నారు మెగాఫ్యాన్స్.
మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గర ధర్నాపై గందరగోళం ... పోలీసుల భారీ భద్రత
మెరుపు ధర్నా చేసే అవకాశం ఉందని భావిస్తూ ఫ్యాన్స్ రివర్స్ ప్లాన్
రాజధాని అమరావతికి మద్దతు తెలపాలంటూ చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ముందుగా ప్రకటించి ఆతర్వాత ఆ ధర్నాను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది . కానీ మెరుపు ధర్నా చేసే అవకాశం ఉందని భావిస్తున్న మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి ఇంటి ముందు హంగామా చేస్తున్నారు. చిరంజీవి జోలికి వస్తే ఊరుకోమని తేల్చి చెప్తున్నారు.
మెగాస్టార్ ఇంటి ముందు అనుకూల నినాదాలతో ధర్నా
ఇక అమరావతి జేఏసీ కంటే ముందే చిరంజీవి ఇంటికి చేరుకున్న మెగా ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా మెగాస్టార్ జిందాబాద్ అంటూ ధర్నాకు దిగారు.ఇక జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ వారు అమరావతి యువసేన జేఏసీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెగా స్టార్ జోలికి వస్తే ఖబడ్దార్ అంటున్నారు. హైదరాబాద్లోని చిరంజీవి ఇంటికి భారీగా చేరుకున్న మెగాస్టార్ అభిమానులు తమ హీరోకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా సహించం అని తేల్చి చెప్తున్నారు.
వారు వస్తారని ముందుగానే ఫ్యాన్స్ హంగామా
ఇక మెగాస్టార్ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పినవారు ఏ సమయంలో అయినా ధర్నా చేస్తారన్న అనుమానంతో మెగాఫ్యాన్స్ చిరంజీవి ఇంటి ముందు ముందుగానే బైఠాయించారు. ఫ్యాన్స్ అక్కడే కూర్చుని చిరంజీవికి అనుకూల నినాదాలు చెయ్యటంతో చిరంజీవి ఇంటి వద్ద హంగామా నెలకొంది. ఏది ఏమైనా రాజధాని అమరావతి రగడ హైదరాబాద్ లోని మెగా స్టార్ ఇంటికి చేరింది. ఇప్పుడు రాజధాని కోసం ఆందోళన చేసే వారు వస్తారని చిరంజీవి ఫ్యాన్స్ అక్కడ కాపలా కూర్చోవటం ఆసక్తికరంగా మారింది.