విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపికి నిధులు రావాలంటే... విలీనం చెయ్యండి:సంచలనం రేపుతున్న కొడాలి నాని వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: గుడివాడ వైసిపి ఎంఎల్ఏ కొడాలినాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపికి నిధులు రావాలంటే ఒకే ఒక పరిష్కార మార్గం ఉందని...అది తెలుగుదేశంపార్టీని బిజెపిలో వెంటనే విలీనం చేసేయడమేనని కొడాలి నాని తేల్చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పెను దుమారం రేపుతున్నాయి. ప్రత్యేకహోదాపై బుధవారం విజయవాడలో జరుగుతున్న చర్చా వేదికలో పాల్గొన్న నాని రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి కొడాలి నాని చేసిన మరి కొన్ని వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు "ఓటుకునోటు" కేసులో దొరికిపోయిన తరువాత కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగ తయారైపోయాడని కొడాలి నాని ఆరోపించారు. ఆ కేసు వల్లే చంద్రబాబు కేంద్రంతో గట్టిగా పోరాడటం కాదు...గట్టిగా మాట్లాడలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు.

మరి ఇన్నాళ్లూ ఎందుకలా?...అదే అతని నైజం...

మరి ఇన్నాళ్లూ ఎందుకలా?...అదే అతని నైజం...

గడచిన మూడున్నర సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్ని విధాలా అద్భుతంగా సాయం చేస్తోందంటూ అభినందనలు కురిపించిన చంద్రబాబు ఇపుడు ఉన్నట్టుండి ఎందుకు అడ్డం తిరుగుతున్నారో అందరికీ అర్థమైపోతోందన్నారు. తన అక్రమాలు కప్పి పుచ్చుకునేందుకు కేంద్ర కన్ను కప్పాలని ప్రయత్నించిన చంద్రబాబు తీరా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి ఇలా ప్రవర్తించడం అతని స్వభావం అన్నారు.

ఇంతకాలం భజన ఎందుకు?...ప్రజలకు వివరించండి...

ఇంతకాలం భజన ఎందుకు?...ప్రజలకు వివరించండి...

ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నట్లుగా ఏపికి కేంద్రం ఏ విధంగానూ సాయం చేయకపోతే మరి ఇంతకాలం చంద్రబాబు ఎందుకు కేంద్రం భజన చేశారో ప్రజలకు ఆయనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు వ్యవహారాలన్నీ ప్రధాని నరేంద్రమోడికి బాగా తెలుసని నాని వ్యాఖ్యానించారు.

జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నాడు...నిలకడగా వైసిపినే...

జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నాడు...నిలకడగా వైసిపినే...

మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసిపి అధ్యక్షుడు జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నాడని కొడాలి నాని చెప్పుకొచ్చారు. గడచిన మూడేళ్లుగా ప్రత్యేకహోదా కోసం నిలకడగా పోరాటం చేస్తోంది వైసిపి మాత్రమేనని, ఆ విషయాన్ని అందరూ గమనించాలని కొడాలి నాని గుర్తు చేశారు.

చంద్రబాబుకు...ఇప్పుడు దిక్కు తోచడం లేదు...

చంద్రబాబుకు...ఇప్పుడు దిక్కు తోచడం లేదు...

ప్రత్యేకహోదా కోసం వైసిపి ఎంపిల రాజీనామాల విషయం, అలాగే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో జగన్ చేసిన ప్రకటనలు విన్న తర్వాత చంద్రబాబుకు అసలు తానేం చెయ్యాలో, ఏం మాట్లాడాలో కూడా దిక్కు తెలీటం లేదంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాగ జగన్ వెన్నుపోటు రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

English summary
Gudivada MLA Kodali Nani once again made sensational comments in Vijayawada. He made these comments in meeting held on the issue of special status in vijayawada. Nani said that the only way to get Funds to the state, to merge the TDP into BJP. Along with these comments made by Nani in this meeting are a created senstion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X