మాట తప్పేది, మడమ తిప్పేది ఎవరో అందరికీ తెలుసు.. చంద్రబాబుపై బొత్స విసుర్లు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. 48 గంటల గడువు, రాజీనామాల పేరుతో డ్రామాలు చేస్తున్నారా అని మండిపడ్డారు. అమరావతి రాజధాని విషయంపై అధికార వైసీపీకి చంద్రబాబు సవాళ్లు విసురుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మంత్రి బొత్స స్పందిస్తూ.. ప్రతీ దానికి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
ప్రజాప్రతినిధులను రాజీనామా చేయాలని కోరడం ఏంటీ అని బొత్స మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలను ఇలా కోరవచ్చా అని అడిగారు. మాటిస్తే నిలబడే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. దివంగత నేత వైఎస్సార్ స్ఫూర్తితో ఆవిర్భవించిన పార్టీ తమదని చెప్పారు. చంద్రబాబు ఏనాడు కూడా మాట మీద నిలబడలేదని విమర్శించారు.
పైగా డెడ్ లైన్ ఇచ్చాం.. స్పందించలేదని అంటారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మీరేం చేశారు అని ప్రశ్నించారు. ఇప్పుడే తగుదునమ్మా అని వచ్చి కామెంట్స్ చేస్తున్నారని గుర్తుచేశారు. విశాఖను నాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. అమరావతిపై రాద్దాంతం చేయడం ఎందుకు.. అదీ శాసన రాజధాని అని గుర్తుచేశారు.
Recommended Video
ఇప్పుడెమో 48 గంటల్లో ముందుకొస్తా.. రాజీనామాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఇదివరకు మాట్లాడిన మాటలను ముందు వెనుక కత్తిరించి అందంగా చూపించడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. రాజీనామాలపై తోక ముడవాల్సిన అవసరం అవసరం లేదని బొత్స స్పష్టంచేశారు. ప్రతీసారి మా తప్పింది ఎవరో అందరికీ తెలుసుని చెప్పారు.