వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై దేవినేని ఆగ్రహం, 20 మంది కోసం 80 మందిని బలి చేస్తారా: మోడీపై కోడెల ఆగ్రహం

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నాడు మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నాడు మండిపడ్డారు.

ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్టుల కోసం రూ.19 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి స్పిల్‌ వేలో 87 శాతం, ఎర్త్‌ కం ర్యాక్‌ఫిల్‌ డామ్‌లో 32 శాతం, స్పిల్‌ చానల్‌లో 40 శాతం, పవర్‌ హౌస్‌లో 60 శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. డిసెంబర్‌ రెండో వారంలో కాంక్రీట్ పనులు ప్రారంభమవుతాయన్నారు.

Minister Devineni lashes out at YSrcp ys Jagan

20 మంది బడాబాబుల కోసం 80 మంది సామాన్య ప్రజలు బలి: కోడెల

ఇరవై మంది బడా బాబుల కోసం 80 మంది సామాన్య ప్రజలను బలిచేయడం సరికాదని ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. నోట్లు రద్దు అంశం మంచిదే అయినా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తక్షణమే చిన్న నోట్లను పూర్తిగా అందుబాటులోకి తేవాలన్నారు.

English summary
Minister Devineni Umamaheswara Rao lashes out at YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X