ఉండవల్లి సూచన, బాబు ప్రభుత్వం చెప్పింది చేస్తా!: బీజేపీ మంత్రి
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు సూచించారు. గతంలో కూడా మోడీ గుజరాత్ అవసరాలకు ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు.
హోదాపై మాట్లాడలేను: కామినేని
ప్రత్యేక హోదా విషయమై తాను మాట్లాడలేనని మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస రావు ఆదివారం నెల్లూరు జిల్లాలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ-టీడీపీ స్నేహం కొనసాగదు, అందుకే మోడీ శత్రువు బాబు: జేసీ సంచలనం
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. టిడిపి - బిజెపి మైత్రిని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. బిజెపి - టిడిపి మైత్రి ఇలాగే కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు బంద్కు పిలుపివ్వాలి: కొణతాల
ప్రత్యేక హోదా విషయమై సీఎం చంద్రబాబు బందుకు పిలుపునివ్వాలని కొణతాల రామకృష్ణ సూచించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా పార్టీలు బందుకు పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 2వ తేదీన లేక ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో తేదీన బందుకు పిలుపునివ్వాలని చెప్పారు. బందులు, నిరసనలు జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.