స్థైర్యం కోల్పోవద్దు: నాయిని, ఎస్ఐకి పరామర్శ(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని శామీర్పేట్ శివారులో నకిలీ కరెన్సీ ముఠా సభ్యులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ వెంకటరెడ్డిని త్వరగా కోలుకోవడం ఆనందదాయకమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరెడ్డిని బుధవారం పరామర్శించారు. వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో ధైర్య సాహసాలతో దొంగల ముఠాను ఎదుర్కొని ప్రాణపాయస్థితిలో ఉన్నప్పటికీ ఆ దొంగను కాల్చి చంపడం వెంకటరెడ్డి ధైర్యానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని, ద్రవ రూపంలో ఆహారం తీసుకుంటున్నాడని చెప్పారు.
మరో నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ధైర్య సాహసాలను ప్రభుత్వం గుర్తించి రివార్డు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు మానసిక స్థైర్యం కోల్పోవద్దని నాయిని అన్నారు.
నాయిని పరామర్శ
నగరంలోని శామీర్పేట్ శివారులో నకిలీ కరెన్సీ ముఠా సభ్యులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ వెంకటరెడ్డిని త్వరగా కోలుకోవడం ఆనందదాయకమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
నాయిని పరామర్శ
ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరెడ్డిని బుధవారం పరామర్శించారు. వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
నాయిని పరామర్శ
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో ధైర్య సాహసాలతో దొంగల ముఠాను ఎదుర్కొని ప్రాణపాయస్థితిలో ఉన్నప్పటికీ ఆ దొంగను కాల్చి చంపడం వెంకటరెడ్డి ధైర్యానికి నిదర్శనమని అన్నారు.
నాయిని పరామర్శ
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని, ద్రవ రూపంలో ఆహారం తీసుకుంటున్నాడని చెప్పారు.