ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఓన్లీ కంపెనీ: మరోసారి లోకేష్ పొరపాటు, కానీ (వీడియో)
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తప్పులో కాలేశారు. ఆయన ఆదివారం విశాఖలో మాట్లాడారు. ప్రసంగంలో ఆయన చేసిన పొరపాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తప్పులో కాలేశారు. ఆయన ఆదివారం విశాఖలో మాట్లాడారు. ప్రసంగంలో ఆయన చేసిన పొరపాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హరికృష్ణతో జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ వ్యాఖ్య, అదే నిజమైతే నిరాశే!
లోకేష్ ప్రసంగంలో దొర్లిన పొరపాటు
ఇటీవల లోకేష్ తన ప్రసంగం సమయంలో చేసిన పొరపాట్లను సోషల్ మీడియాలో పలువురు అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా లోకేష్ విశాఖలో ప్రసంగం సమయంలో చేసిన పొరపాటును అప్ లోడ్ చేశారు.
ఇలా మాట్లాడారు
అదే సమయంలో లోకేష్ తన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నారు. 'ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఓన్లీ కంపెనీ టు హావ్ ఫైబర్ టు ఎవ్రీ హోమ్' అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి.
ఆ వెంటనే స్టేట్ అన్నారు.
అయితే, ఆ వెంటనే నారా లోకేష్ తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓన్లీ స్టేట్ అంటూ ఆ తర్వాత తమాయించుకున్నారు. కానీ ఏపీ ఈజ్ ది ఓన్లీ కంపెనీ అనే వరకు మాత్రం ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
లోకేష్ హాజరు
కాగా, లోకేష్ ఆధివారం అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శనకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఇవి జరుగుతున్నాయి. 30 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఆవిష్కరణల సభకు హాజరైన లోకేష్ ప్రసంగించారు.