ఇదేనా 'రాజన్న రాజ్యం'..? వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో : లోకేశ్
ఆశా కార్యకర్త జయలక్ష్మి ఆత్మహత్యకు మంత్రి పేర్ని నాని వేధింపులే ప్రధాన కారణమని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు జయలక్ష్మి రాసిన లేఖను లోకేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే మంత్రిపై పలు విమర్శలు చేశారు. నేరుగా మంత్రి వేధింపులకు పాల్పడితే వైసీపీ నేతలు ఎంతమందిని బలితీసుకుంటారోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రానికి మహిళ హోంమంత్రి ఉన్నప్పుడే తోటి మహిళలలు వేధింపులకు గురువుతున్నారని అన్నారు. మహిళలకు రాష్ట్రంలో సరైన భద్రత లేదని పేర్కోన్నారు. ఇదేనా రాజన్న రాజ్యం అంటూ ముఖ్యమంత్రి జగన్ను ప్రశ్నించారు...
కాగా క్రిష్ణా జిల్లా మచీలీపట్నం ప్రాంతానికి చెందిన జయలక్ష్మి రాజుపేట ప్రాంతంలో గత పదిహేనేళ్లుగా ఆశ వర్కర్గా పని చేస్తున్నారు. అయితే ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ , అయిన మట్టా తులసీ అనే వైసీపీ నాయకురాలు ఆమేను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించారని ,దీనికి మంత్రి పేర్ని నానీ కూడ మద్దతుగా ఉన్నారంటూ ఆవేదన చెందిన ఆమే ఓ లేఖ రాసి నిద్రమాత్రలు ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో ఆమేను హుటాహుటిన మచీలీ పట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైకాపా మంత్రి పేర్ని నాని వేధింపులకు జయలక్ష్మిగారు ఆత్మహత్యాయత్నం చేసారు. ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు. మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో ? ఇదేనా రాజన్న రాజ్యం @ysjagan గారు ? pic.twitter.com/hSdW7tXHjg
— Lokesh Nara (@naralokesh) July 14, 2019