వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టర్‌తో ఆటోలో ప్రయాణించిన ఏపీ మంత్రి!: ఎక్కడికి?, ఎందుకు?

రవాణా శాఖ అధికారులు, కలెక్టర్ భాస్కర్, ఏలూరు మేయర్ నూర్జహాన్ సహా మంత్రి పితాని ఒకే ఆటోలో ప్రయాణించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత.. ఆటో బిల్లును మొబైల్ యాప్ ద్వారా చెల్లించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రజలను నగదు రహిత చెల్లింపుల వైపు మళ్లించేందుకు ఏపీ కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. ఏలూరు కలెక్టర్‌ను వెంటపెట్టుకుని ఓ ఆటోలో ఆయన ప్రయాణించారు. అనంతరం ఆటో చెల్లింపులను మొబైల్ యాప్ ద్వారా చెల్లించేశారు.

ప్రజలకు నగదు రహిత చెల్లింపుల పట్ల అవగాహన కల్పించడానికి మంత్రి పితాని చేస్తున్న ప్రయత్నం పలువురిని ఆకట్టుకుంది. రవాణా శాఖ అధికారులు, కలెక్టర్ భాస్కర్, ఏలూరు మేయర్ నూర్జహాన్ సహా మంత్రి పితాని ఒకే ఆటోలో ప్రయాణించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత.. ఆటో బిల్లును మొబైల్ యాప్ ద్వారా చెల్లించారు.

minister pithani satyanarayana awaring people on cash less transactions

కలెక్టర్ భాస్కర్ రూ.50 ఆటో బిల్లును యాప్ ద్వారా ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాలో జమచేశారు. చిల్లర సమస్యలు తలెత్తకుండా ఆటో చార్జీలకు వీలుగా ఉండేందుకు అనువుగా ఈ యాప్ తయారు చేసినట్లు చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి పితాని మాట్లాడుతూ భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడేందుకు ఇప్పటినుంచే ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులకు పిలుపునిచ్చారు.

English summary
AP minister Pithani Satyanarayana travelled in a auto with Eluru collector Bhaskar to aware people on Cash less transactions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X