Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కు లేఖ రాయడంతో పీక్స్ కు చేరిన వివాదం

Minister Satya Kumar: ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిర్మితమైన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్దంగా ఉన్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు సవాల్ విసురుతోన్నారు.

కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు దమ్ముంటే తమతో వాటిని పరిశీలించడానికి రావాలని డిమాండ్ చేస్తోన్నారు. పేద విద్యార్ధులకు మెడికల్ విద్య, వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే.. చంద్రబాబు వాటిని తనకు కావాల్సిన వారికి తెగనమ్మేందుకు సిద్దపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. దీనిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక కూటమి మంత్రుల ఆయనపై దూషణలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.

Minister Satya Kumar wrote a letter to YS Jagan regarding the PPP model of Medical Colleges

ఈ పరిణామాల మధ్య మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తాజాగా వైఎస్ జగన్ కు లేఖ రాశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని జగన్ చెబుతున్నదంతా అబద్దాలేనని తేల్చిచెప్పారు సత్యకుమార్.

రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని సత్యకుమార్ పేర్కొన్నారు. వైసీపీ హాయంలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకు రాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టిందని వెల్లడించారు. వైఎస్ జగన్ లా కూటమి ప్రభుత్వం విఫలం కాకూడదనే పీపీపీ విధానం ఎంచుకున్నట్లు సత్యకుమార్ తెలియజేశారు.

పీపీపీకీ, ప్రైవేటీకరణకూ చాలా వ్యత్యాసం ఉందని సత్యకుమార్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలపై తన వివరణకు వైఎస్ జగన్ దమ్ముంటే స్పందించాలని డిమాండ్ చేశారు. తాము చేయని వాటి గురించి కూడా గత జగన్ ప్రభుత్వం తామే చేశామని చెప్పుకోవడం దారుణం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+