విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను బ్యాడ్మింట‌న్ ఆడుతా: గోపీచంద్‌ తెలుగువాడు కావడం గర్వంగా ఉందన్న వెంకయ్య

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ క్లబ్ ఆధ్వర్యంలో రియో ఒలింపిక్స్ రజక పతక విజేత పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వారిరువురికా అభినందనలు తెలిపారు.

క్రీడల ప్రావిన్యానికి మూల కేంద్రం గోపీచంద్‌ అని, ఆయన తెలుగువాడు కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. అకాడమీ పెట్టి, కష్టనష్టాలకు ఓర్చి, ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తున్నారని అన్నారు. భారత జాతి గర్వించదగ్గ సింధుని తయారు చేశారని వెంకయ్య కొనియాడారు.

Minister Venkaiah Naidu Praises Pv Sindhu and Pullela Gopichand at vijayawada

చిన్న వయసులోనే కఠోరమైన దీక్ష, పట్టుదలతో భారత్ దేశానికి రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిందని వెంకయ్య అభినందించారు. శారీర‌క శ్ర‌మ లేక‌పోతే మ‌న‌స్సులో ఉత్సాహం ఉండ‌ద‌ని ఈ సందర్భంగా ఆయన అన్నారు. శారీర‌క శ్ర‌మ‌తోనే మాన‌సిక ఆరోగ్యం ల‌భిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

Minister Venkaiah Naidu Praises Pv Sindhu and Pullela Gopichand at vijayawada

క్రీడల ద్వారా శారీర‌క శ్ర‌మ క‌లుగుతుంద‌ని చెప్పిన ఆయన ఈ వ‌య‌సులోనూ తాను ఇంత ఉత్సాహంగా ఉన్నానంటే తాను చేస్తోన్న శ్ర‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పారు. ప్రతిరోజూ ఉదయం తాను కూడా బ్యాడ్మింట‌న్ ఆడుతాన‌ని వెంకయ్య తెలిపారు. దేశంలో క్రీడ‌ల‌ని మ‌రింత‌ ప్రోత్సాహించాల్సి ఉందని అన్నారు.

English summary
Minister Venkaiah Naidu Praises Pv Sindhu and Pullela Gopichand at vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X