నీలి చిత్రాలు చూపిస్తూ ఏడాదిగా మైనర్ బాలికపై అత్యాచారం
మానవత్వాన్ని మరిచాడు. కూతురు వరసైన తొమ్మిదేళ్ళ చిన్నారిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. నీలి చిత్రాలూ చూపిస్తూ మరీ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న డ్రైవర్ ఉదంతం ఒకటి నెల్లూరు జిల్ల
నెల్లూరు :మానవత్వాన్ని మరిచాడు. కూతురు వరసైన తొమ్మిదేళ్ళ చిన్నారిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. నీలి చిత్రాలూ చూపిస్తూ మరీ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న డ్రైవర్ ఉదంతం ఒకటి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొంది.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం పిల్లలతో కలిసి నెల్లూరుకు వచ్చింది. నెల్లూరులో డ్రైవర్ గా పనిచేస్తోన్న పెంచలయ్య అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త సహాజీవనానికి దారితీసింది.పెంచలయ్య భార్య, పిల్లలను వదిలేశారు.
ఉదయం పూట ఆ మహిళ ఇళ్ళల్లో పాచిపనులకు వెళ్తుండేది. పెంచలయ్య డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. ఆ మహిళ కుమార్తైపై పెంచలయ్య కన్ను పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంచలయ్య ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఏడాదిగా ఈ దారణాన్ని కొనసాగిస్తున్నాడు.
నీలి చిత్రాలను చూపిస్తూ మరీ ఆ మైనర్ బాలికపై పెంచలయ్య రేప్ చేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని స్కూల్లోని తన స్నేహితురాలికి ఆ బాలిక చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఐసిడిఎస్ అధికారులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. బాధితులతో పాటు ఐసిడిఎస్ అధికారులు పెంచలయ్యపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.