చంద్రబాబే కండువా కప్పి 'ఆమంచి'ని టీడీపీలోకి ఆహ్వానించారు(ఫోటోలు)
హైదరాబాద్: ప్రకాశం జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా తయారు చేసేందుకు కృషి చేస్తానని చీరాల స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బుధవారం నాడు ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
టీడీపీ పార్టీ కండువా కప్పి ఆమంచి కృష్ణమోహన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి టీడీపీ అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూస్తుంటే బాధేస్తుందన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్నారు.
వారానికి మూడు రోజులు హైదరాబాద్లో, మరో మూడు రోజులు ఏపీలో ఉంటున్నానన్నారు. త్వరలో ఉద్యోగులు కూడా అక్కడికి వస్తారన్నారు. ఇప్పుడు మనది రెండు కాపురాల అవస్థ అని పేర్కొన్నారు. రాష్టాన్ని విభజించిన కాంగ్రెస్ని వీడి స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారని, ఆయన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రకాశం జిల్లాను టీడీపీకి కంచుకోటలా తయారు చేస్తా: ఎమ్మెల్యే ఆమంచి
ప్రకాశం జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా తయారు చేసేందుకు కృషి చేస్తానని చీరాల స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బుధవారం నాడు ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
ప్రకాశం జిల్లాను టీడీపీకి కంచుకోటలా తయారు చేస్తా: ఎమ్మెల్యే ఆమంచి
టీడీపీ పార్టీ కండువా కప్పి ఆమంచి కృష్ణమోహన్కి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి టీడీపీ అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూస్తుంటే బాధేస్తుందన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్నారు.
ప్రకాశం జిల్లాను టీడీపీకి కంచుకోటలా తయారు చేస్తా: ఎమ్మెల్యే ఆమంచి
వారానికి మూడు రోజులు హైదరాబాద్లో, మరో మూడు రోజులు ఏపీలో ఉంటున్నానన్నారు. త్వరలో ఉద్యోగులు కూడా అక్కడికి వస్తారన్నారు. ఇప్పుడు మనది రెండు కాపురాల అవస్థ అని పేర్కొన్నారు. రాష్టాన్ని విభజించిన కాంగ్రెస్ని వీడి స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారని, ఆయన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రకాశం జిల్లాను టీడీపీకి కంచుకోటలా తయారు చేస్తా: ఎమ్మెల్యే ఆమంచి
బుధవారం ఎన్టీఆర్ భవన్లో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, దాదాపు వెయ్యి మంది అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన్ను కండువా కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. కాగా, తమిళనాడు గవర్నర్ రోశయ్య తనకు దేవుడిలాంటి వారని ఆమంచి అన్నారు.
ప్రకాశం జిల్లాను టీడీపీకి కంచుకోటలా తయారు చేస్తా: ఎమ్మెల్యే ఆమంచి
ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మలుచుకునే చంద్రబాబు పట్టుదల బాగా నచ్చిందన్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఆయన స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఆయన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాజకీయ శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు.
ప్రకాశం జిల్లాను టీడీపీకి కంచుకోటలా తయారు చేస్తా: ఎమ్మెల్యే ఆమంచి
మొన్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ను వీడి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కొద్ది కాలంగా టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆయన ఎట్టకేలకు బుధవారం పసుపు కండువా కప్పుకున్నారు. అయితే ఆమంచి చేరికను టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీతతో పాటు మరో కీలక ఎంపీ వ్యతిరేకించారు.
ప్రకాశం జిల్లాను టీడీపీకి కంచుకోటలా తయారు చేస్తా: ఎమ్మెల్యే ఆమంచి
ఈ నేపథ్యంలో మంగళవారం పోతుల సునీత జిల్లా మంత్రి సిద్ధా రాఘవరావు, మరో మంత్రి రావెల కిషోర్బాబు చంద్రబాబుతో భేటీ అయ్యి ఆమంచి చేరికపై చర్చించారు. సునీత భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చి, ఆమెను బుజ్జగించినట్టు తెలుస్తోంది.