ఆ పదాన్ని వెనక్కి తీస్కోండి: జగన్ వ్యాఖ్యలపై అనిత అభ్యంతరం
మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు.
అమరావతి: మంగళవారం ఉదయం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభ జరిగిన కొద్దిసేపు నీటిపారుదల ప్రాజెక్టులపై, ఎస్సీఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన నిధులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
జగన్ వ్యాఖ్యలతో చంద్రబాబు, స్పీకర్ సహా అందరూ నవ్వేశారు: సభ నుంచి వైసీపీ వాకౌట్
ఎస్సీ, ఎస్టీలకు 50యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటున్నారని, వారికి మీరు ముష్టి వేస్తున్నారా? అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు.
జగన్కు సవాల్ విసిరేంత మగడివా? నీకంటే సీమలో పంది నయం: జేసీపై చెవిరెడ్డి సంచలనం
హై ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని ఏర్పాటు చేశాం: అచ్చెన్నాయుడు
బడ్జెట్ సమావేశాల్లో ఓ ప్రశ్నకు సమాధానానంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2.14కోట్ల ఎల్ఈడీ బల్బులను సాధారణ బల్బులుగా మార్చడం వల్ల 1500మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని అచ్చెన్నాయుడు తెలిపారు.