ఆ నిర్ణయం నచ్చలేదు.. బాబు నుంచి భరోసా వచ్చింది గనుకే: టీడీపీలో చేరికపై ఎమ్మెల్యే రాజేశ్వరి
కార్యకర్తలతో చర్చించాకే వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు.
Recommended Video
విజయవాడ: కార్యకర్తలతో చర్చించాకే వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని జగన్ తీసుకున్న నిర్ణయం తనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలకు నచ్చలేదని అన్నారు.
జగన్కు గట్టి షాక్: మరో వికెట్ డౌన్.. టీడీపీలోకి ఎమ్మెల్యే రాజేశ్వరి, డైరెక్షన్ జ్యోతులదే!
శనివారం ఉదయం టీడీపీలో చేరిక అనంతరం ఆమె మాట్లాడారు. పార్టీ వీడటంపై స్పందిస్తూ.. తన నియోజకవర్గంలో ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారంతా తనపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ జగన్, తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోగా.. అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు.
ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నర సమమే మిగిలి ఉన్న తరుణంలో.. అసెంబ్లీని బహిష్కరిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్దిపై చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తానని అన్నారు.