వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్చిన ఎంఎల్ఏ రోజా

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ, సినీ నటి రోజా కాపాడారు. ఈ ఘటన శుక్రవారం నాడు నేండ్రగుంట వద్ద చోటుచేసుకొంది. ప్రమాదానికి గురైన మహిళ కుటుంబసభ్యులు ఎంఏల్ఏ రోజాకు ధన్యవాదాలు తెలిపారు.

చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని నేండ్రగుంట వద్ద సింధు అనే మహిళ ప్రమాదవశాత్తు స్కూటీ పై నుండి కిందపడి తీవ్రంగా గాయపడింది.అదే సమయంలో అదే రోడ్డుపై వెళ్తున్న ఎంఏల్ఏ రోజా గాయపడిన సింధును చూశారు.వెంటనే తన కారులో పూతలపట్టు వరకు సిందును తీసుకెళ్ళారు.

 mla roja protect a lady

పూతలపట్టులోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు ఎంఏల్ఏ రోజా,.సకాలంలో స్పందించి ఆసుపత్రికి తీసుకురావడం వల్లే సిందు ప్రాణాలతో బయటపడిందని వైద్యులు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిందును సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడిన ఎంఏల్ఏ రోజాకు సింధు కుటుంసభ్యులు దన్యవాదాలు తెలిపారు.సకాలంలో రోజా స్పందించిన కారణంగానే సింధు బతికిందని వారంటున్నారు.

English summary
ysrcp mla roja protect a lady on friday in chittoor district.sindhu injured road accident at nendragunta village.roja went to on the road nendragunta, she saw road accident ,she quicklyresponse shifted to putalapattu hospital,sindhu family members thankful to roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X