వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పూటుగా తాగి హోటల్లో గదులు కావాలని చిందులు తొక్కిన ఎమ్మెల్యేలు
పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా తాగి విశాఖపట్నంలో చిందులు వేసిన వైనం వెలుగు చూసింది.
అమరావతి: పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బాగా తాగి విశాఖపట్నంలో చిందులు వేసిన వైనం వెలుగు చూసింది.
విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు వచ్చారు. అనంతరం నోవాటెల్ హోటల్ వద్దకు గురువారం అర్ధరాత్రి వచ్చి తమకు గదులు కావాలని సిబ్బందిపై చిందులు తొక్కారు.
అయితే ఎమ్మెల్యేలకు మరో హోటల్లో గదులు కేటాయించామని అధికారులు చెప్పినా వినిపించుకోలేదు. నోవాటెల్లోనే కావాలని పట్టుబడ్డారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు బాగా తాగి ఉన్నారని అంటున్నారు.
Comments
English summary
MLAs from West Godavari and Nellore created nuisancein Vishakapatnam on Thursday night.
Story first published: Friday, November 17, 2017, 17:10 [IST]