ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు: మార్టూరులో పిడిఎఫ్ మద్దతుదారుపై దాడి
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన ఓటింగ్ సరళిని పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు.
విజయవాడ: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన ఓటింగ్ సరళిని పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 54 పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ పరిస్థితిని కలెక్టర్ వెబ్ టెలికాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.
ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పిడిఎఫ్ మద్దతుదారుణపై దాడి
ప్రకాశం జిల్లా మార్టూరులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్టూరులోని పోలింగ్ బూత్కు 100 మీటర్ల దూరంలో ఉండి.. ఓ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఉపసర్పంచ్ అభ్యర్థిస్తున్నారు.
అలా ఎందుకు ప్రచారం చేస్తున్నారని పీడీఎఫ్కు చెందిన వ్యక్తి ప్రశ్నించారు. దీంతో సదరు ఉపసర్పంచ్ సోదరులు, మరియు ఆ పార్టీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే పీడీఎఫ్ వ్యక్తి పైన దాడి చేశారని తెలుస్తోంది. దీనిని ఖండిస్తూ పీడీఎఫ్కు చెందిన వ్యక్తులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.