స్ట్రెచర్ అడిగితే కుమ్మేశాడు, నేలపై ఈడ్చుకెళ్ళాడు, గుంటూరులో దారుణం
గుంటూరు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. రోగి సహాయకుడిపై ఆసుపత్రి ఎంఏల్ఓ తీవ్రంగా దాడి చేశాడు. నేలపై ఈడ్చుకొంటూ కొట్టుకొంటూ వెళ్ళాడు. ఈ ఘటనపై సూపరింటెండ్ కు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. రోగి సహాయకుడిపై ఆసుపత్రి ఎంఏల్ఓ తీవ్రంగా దాడి చేశాడు. నేలపై ఈడ్చుకొంటూ కొట్టుకొంటూ వెళ్ళాడు. ఈ ఘటనపై సూపరింటెండ్ కు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
ప్రకాశం జిల్లాకు చెందిన కోటయ్య, నాగరాజు అనే ఇద్దరు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. కోటయ్యకు ఆరోగ్యం బాగాలేదు. అయితే ఆయనకు తోడుగా నాగరాజు వచ్చాడు.అయితే కోటయ్యను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్ళేందుకు స్ట్రెచర్ లేదు.
ఈ విషయమై నాగరాజు ఆసుపత్రి ఎంఎల్ఓ దృష్టికి తీసుకెళ్ళాడు.అయితే దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఏల్ఓ నాగరాజుపై విచక్షణరహితంగా దాడి చేశాడు.
నాగరాజును కొట్టుకొంటూ బయటకు తీసుకెళ్ళాడు. నేలపై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళాడు. ఈ ఘటన జరగుతున్న సమయంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు, వారి సహయకులు ప్రేక్షకులుగా చూస్తూ కూర్చుకొన్నారు.
అయితే ఈ ఘటనతో ఖంగుతిన్న నాగరాజు ఆసుపత్రి సూపరింటెండ్ కు ఫిర్యాదు చేశారు.అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని ఆసుపత్రి సూపరింటెండ్ సూచించాడు. ఈ విషయమై విచారణకు ఆయన ఆదేశించారు. సీసీటీవి పుటేజీ ఆధారంగా ఎంఏల్ఓ నాగరాజుపై దాడి దృశ్యాలను పరిశీలించారు సూపరింటెండ్.