23 నుండి టిలో మోడీ, పవన్: పవన్ వచ్చాక షెడ్యూల్
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 23వ తేదీ నుండి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, మోడీతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం చెప్పారు.
23 నుండి తెలంగాణ జిల్లాల్లో మోడీ పర్యటిస్తారన్నారు. మోడీతో పాటు పవన్, తమ పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ ప్రచారంలో పాల్గొంటారన్నారు.
హైదరాబాదు, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ సభలలో మోడీ పాల్గొంటారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఉంటుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లలో జరిగే సభలలోను మోడీతో పవన్, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు పాల్గొంటారు.

మే 1 నుంచి సీమాంధ్రలో మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి పర్యటించనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ, అనంతపురం, తిరుపతి, నర్సాపురం, విశాఖలో బహిరంగ సభలకు సన్నాహాలు జరుగుతున్నాయి. బిజెపి తరపున ప్రచారం నిమిత్తం కర్నాటకు వెళ్లిన పవన్ తిరిగి వచ్చిన తర్వాత ఇరు ప్రాంతాల్లో పర్యటనపై షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రేపు సోనియా ప్రచారం
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రేపు తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారు. కరీంనగర్ జిల్లా బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు.
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications