నేను హామీ ఇస్తున్నా: మోడీ, 'అలా భయపెట్టే ప్రయత్నం'
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుపు ప్రత్యేకమైనదని చెప్పారు. ఇక్కడ బీజేపీ అంకితభావంతో సేవలు అందిస్తుందని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుపు ప్రత్యేకమైనదని చెప్పారు. ఇక్కడ బీజేపీ అంకితభావంతో సేవలు అందిస్తుందని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. యువత నుంచి పద్ద ఎత్తున మద్దతు లభించిందన్నారు. బీజేపీ చారిత్మాత్మక విజయం సుపరిపాలన, అభివృద్ధికి నాంది అన్నారు.
బీజేపీ మాకంటే మంచి పాలన అందిస్తుందనే, ట్యూబ్లెస్: అఖిలేష్ షాకింగ్
గెలుపుపై వెంకయ్య
మోడీ తిరుగులేని నాయకుడిగా అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్నారని వెంకయ్య చెప్పారు. మోడీని.. ప్రజలు క్రమేపి పేదల పెన్నిదిగా భావిస్తున్నారని చెప్పారు. ప్రజలు మోడీ వెంట ఉన్నారని చెప్పారు.
మోడీ తిరుగులేని నాయకుడిగా అన్ని వర్గాల అభిమానం చూరగొన్నారన్నారు. కుల, మత, ప్రాంత శక్తులను ఎదిరించి.. మోడీ అన్ని వర్గాల ఆదరణ పొందుతారని చెప్పారు. విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించి భయపెట్టే ప్రయత్నం చేశాయన్నారు.
సోనియా-రాహుల్లకూ షాకిచ్చాం!, మాయవతిపై నో: అమిత్ షా
మోడీ అంటే మూడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా అన్నారు. మోడీ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పారు. నల్లధనంపై పోరాటానికి విపక్షాలు వక్రభాష్యం చెప్పాయన్నారు.
కాంగ్రెస్ కంచుకోట అమేథీలోను కాంగ్రెస్ పరాజయం పాలైందన్నారు. బీజేపీకి మణిపూర్లో 36 శాతం, గోవాలో 34 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడులేని పార్టీగా మిగిలిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందన్నారు.