కెసిఆర్తో మోహన్బాబు భేటీ: మనోజ్ నిశ్చితార్థానికి పిలుపు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును సినీ నటుడు మోహన్బాబు కలిశారు. తన కుమారుడు, సినీ హీరో మనోజ్ నిశ్చితార్థానికి మోహన్బాబు కెసిఆర్ను ఆహ్వానించారు. మనోజ్ ప్రణితను వివాహం చేసుకోనున్నారు. కొద్ది రోజుల క్రితం మనోజ్ వివాహ విషయంపై మోహన్బాబు మీడియాతో మాట్లాడారు.
‘మా పెద్ద కోడలు వెరోనికా, ప్రణతి ఇద్దరూ క్లాస్మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్లో సీపీఏ చేసింది. వివాహ విషయాన్ని ప్రణతి తల్లిదండ్రులతో మాట్లాడాం' అని మోహన్ బాబు ఇటీవల చెప్పారు.
‘త్వరలోనే ఓ మంచి రోజు చూసి, నిశ్చయతాంబూలం, వివాహం జరిపించనున్నాం. ఈ శుభవార్తను తన అభిమానులైన అందరితో పంచుకోవాలనుకున్నాను. మీ అందరి ఆశీస్సులతో పెళ్లి జరుగుతంద'ని చెప్పారు.
కెసిఆర్ను ఆయన అధికారిక నివాసంలో మోహన్ బాబు కలిశారు. మోహన్ బాబు కుమారుడు మనోజ్ నిశ్చితార్థం మార్చి 4వ తేదీన జరగనుంది.