ఏపీకి థ్యాంక్స్: నంది అవార్డుపై నటుడు మోహన్ లాల్ స్పందన
మళయాల నటుడు మోహన్లాల్ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జనతా గ్యారేజ్ చిత్రంలో ఆయన నటించారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో నంది అవార్డు ప్రకటించారు.
అమరావతి: మళయాల నటుడు మోహన్లాల్ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జనతా గ్యారేజ్ చిత్రంలో ఆయన నటించారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడు విభాగంలో నంది అవార్డు ప్రకటించారు.
చదవండి: అవార్డుల వివాదం: ప్రశ్నించినందుకు 'నంది' ఇవ్వలేదా, బాబు-బాలయ్యలపై 'కమ్మ' వివాదం
ఈ నేపథ్యంలో మోహన్లాల్ ఆదివారం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు అని, ఈ ప్రశంస, గౌరవాన్ని దర్శకుడు కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్, జూ ఎన్టీఆర్.. మొత్తం జనతా గ్యారేజ్ బృందంతో పంచుకున్నానని పేర్కొన్నారు. అవార్డు నేపథ్యంలో సినిమా యూనిట్నూ కొనియాడారు.
చదవండి: 'మా చిరంజీవి అంటే మీకే నష్టం, కాపుల కడుపు నిండదు' 'బాలకృష్ణకు ఓకే, లెజెండ్పైనే '
కాగా, నంది అవార్డులపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అవార్డులు కొందరికి, ఓ వర్గానికే ఎక్కువగా వచ్చాయని కొందరు సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు.
చదవండి: టైం కాదు, మీ ప్రాబ్లం: నంది వివాదంపై బాలకృష్ణ, బ్రాహ్మణి, జగపతి బాబులు ఇలా