కొడుకు గొంతు కోసిన తల్లి, ఓ వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంతో ఓ కన్న తల్లి పేగును తెంచుకుని పుట్టిన కన్న బిడ్డను గొంతు కోసి హత మార్చింది. ఆ తర్వాత తాను కూడా గొంతు కొసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు.
నంద్యాలలో ఓ వ్యక్తి దారుణ హత్య
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని నూనెపల్లెకు చెందిన గౌస్ అనే వ్యక్తిని అంజిమన్ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.