టి వస్తే దుకాణం బంద్: కెసిఆర్పై మోత్కుపల్లి ఫైర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తన దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుందని కెసిఆర్ విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విభజనపై కాంగ్రెస్-టిఆర్ఎస్ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతామని చెప్పిన కెసిఆర్, ఇప్పుడు మాటమార్చి నాటకాలాడుతున్నారని అన్నారు. డబ్బు సంచులు, ప్యాకేజీలు ఇక రావనే ఉద్దేశంతోనే విభజనను అడ్డుకునేందుకు కెసిఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.
ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీతో కెసిఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మ బలిదానం చేసుకుంటే.. కెసిఆర్ కోట్ల కోసం ఆశపడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తెలంగాణ విషయంలో కేసిఆర్పైనే పోరాటం చేయాలని, కెసిఆర్ బంద్ ప్రకటిస్తే మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని మోత్కుపల్లి అన్నారు.