చంద్రబాబు, నారాయణలపై జేసీ సంచలనం: దొంగల్లా అమ్ముకుంటారని..
తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు అవగాహన లేదని వ్యాఖ్యానించారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు అవగాహన లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
'రాత్రిపూట జగన్ దందా': సూట్కేస్ కంపెనీ.. ఢిల్లీ టూర్పై టిడిపి అనుమానం
అమరావతి అభివృద్ధికి తన సలహాలు తీసుకోవాలని మంత్రి నారాయణకు ఎంపి జేసీ సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు బ్యాంకుతో టైఅప్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు. లేదంటే ఎమ్మెల్యేలు ఆ స్థలాన్ని కొంతకాలం తర్వాత దొంగల్లా అమ్ముకుంటారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి ఇళ్లు నిర్మించకుండా అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఇళ్లు కూడ ఒక్కొక్కరికి ఒక కిలోమీటర్ దూరంలో నిర్మించాలని ఆయన మంత్రికి సూచించారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య గొడవ లేకుంటా ఉంటుందన్నారు.
కర్నూలు కార్పోరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎంపీ టిజి వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలతో భేటీ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.