డెడ్లైన్: అలకపాన్పు ఎక్కిన జేసీ...డిమాండ్లు నెరవేర్చకుంటే రాజీనామా
Recommended Video
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలకపాన్పు ఎక్కారు. ఎంపీనైన తనను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం ఫైఓవర్ కోసం తాను నిధులు అడిగితే అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన అలకచెందారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని సన్నిహితుల దగ్గర జేసీ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ నెల 25లోగా తన డిమాండ్లు నెరవేరకపోతే పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు జేసీ తెలిపారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను టీడీపీలో చేర్చుకోకపోవడంపై కూడా జేసీ తీవ్ర అసంతృప్తి చేశారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి పార్టీకి డెడ్లైన్ విధించారు.
ఈ మధ్య కాలంలో టీడీపీ చేస్తున్న దీక్షల్లో జేసీ ప్రసంగమే చాలా హైలైట్గా నిలుస్తోంది. ఎలాంటి మొహమాటం లేకుండా సీఎం చంద్రబాబుకు సైతం వేదికపైనే పరోక్ష చురకలు అంటిస్తూ వచ్చారు. మరోవైపు బాబును పొగుడ్తూ వైసీపీ అధినేతపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు.