వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోకేష్ నాయుడు, పంది పట్టాభి, తాగుబోతుపాత్రుడు, బుచ్చిగాడు, పాయకరావుపేట చింతామణి: తిట్లు ఆపని సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి నాయకులపై నిత్యం పరుష పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. డోసు పెంచిమరీ తిట్టిపోస్తున్నారు. వ్యక్తిగత విమర్శలతో టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లను ఎక్కువగా టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి, తాజాగా అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వంగలపూడి అనిత లను సైతం టార్గెట్ చేస్తున్నారు. తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో, అసభ్య పదజాలంతో తిట్టిపోస్తున్నారు.

బోకేష్ నాయుడు, తాగుబోతు పాత్రుడు అంటూ సాయిరెడ్డి టార్గెట్

తాజాగా మరోమారు టిడిపి నేతల పై విరుచుకుపడిన విజయసాయిరెడ్డి టిడిపి నేతలు గంజాయి, మద్యం ఎక్కువ తాగుతున్నారు, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గంజాయి, మద్యం ఎక్కువ తాగితే.. బోకేష్ నాయుడు, పంది పట్టాభి, తాగుబోతు పాత్రుడు, బుచ్చిగాడు, పాయకరావుపేట చింతామణి మాదిరిగా పిచ్చి వాళ్ళుగా తయారవుతారు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇక ఏపీలో జే బ్రాండ్స్ మద్యం అమ్ముడు అవుతోందని, అందులో విషయం ఉందని టీడీపీ చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

చీటర్ చంద్రం, బోకేష్ తాగిన మద్యంలో విషం ఉందా?

చీటర్ చంద్రం, బోకేష్ తాగిన మద్యంలో విషం ఉందా?

చీటర్ చంద్రం, బోకేష్ తాగిన మద్యంలో విషం ఉందా?తండ్రీకొడుకులు బయటకు వచ్చి చెప్పాలి అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో జగన్ మనుషులు చెలగాటం ఆడుతున్నారని, మద్యంతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడే మందుల లోనూ కల్తీకి పాల్పడుతున్నారని టిడిపి అధికార ప్రతినిధి కుమార్ రెడ్డి పట్టాభిరామ్ అరబిందో ఫార్మా కంపెనీ కి సంబంధించి కల్తీ మందులు తయారవుతున్నాయని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా బదులిచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

దున్నపోతులాగా దేహం పెరిగిందిగాని మైండ్ పెరగలేదురా: పట్టాభిపై సాయిరెడ్డి

క్యాన్సర్ కారక ఫార్మల్ డీహైడ్ కలిపినందుకు హెరిటేజ్ పాలలో అతి ప్రమాదకరమైన ఈకొలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉందని తమిళనాడు, కేరళ నిషేధించాయని ఎదురు దాడి చేశారు. ఒరేయ్ సీమపంది పొట్టాభి, ఫార్మా కంపెనీలను ఎఫ్డీఏ హెచ్చరించడం అనేది నిరంతర ప్రక్రియ అని పట్టాభిని దూషించిన విజయసాయిరెడ్డి, నీకు దున్నపోతులాగా దేహం పెరిగిందిగాని మైండ్ పెరగలేదురా అంటూ మండిపడ్డారు.

‘కిక్ బాబు అవుట్.. గెట్ ది పవర్.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం

‘కిక్ బాబు అవుట్.. గెట్ ది పవర్.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం

అంతకుముందు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లో 'కిక్ బాబు అవుట్.. గెట్ ది పవర్.. సర్వ్ ది పీపుల్' అనే నినాదంతో, 175 స్థానాలూ గెలుస్తామన్న ధీమాతో 2024 ఎన్నికలకు వెళ్తున్నాం అంటూ పేర్కొన్నారు. ఖచ్చితంగా మళ్లీ గెలిచి అప్పుడు కూడా పార్టీ ప్లీనరీని మరింత ఘనంగా నిర్వహించుకుంటాం అని విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తధ్యమని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.

English summary
YSRCP MP Vijayasai Reddy insulted and made abusive comments on Lokesh, Pattabhi, Ayyannapatradu, Butchaiah Choudary, Vangalapudi Anitha as Bokesh Naidu, pig Pattabhi, drunkard patradu, Butchigadu and Payakaraopeta Chintamani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X