అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్ పుస్తకాలు, కొనసాగుతోన్న ఆందోళన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: అనంతపురంలో వెలుగుచూసిన నకిలీ పాస్ పుస్తకాల ఉదంతం మరుకువ ముందే తాజాగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడులో రెవెన్యూ ఉద్యోగుల అవినీతి బయపడింది. పెదకూరపాడులో పనిచేస్తున్న ముగ్గురు వీఆర్వోలు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలను రైతలుకు విక్రయించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్‌ ముగ్గురు వీఆర్వోలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీఆర్వోలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

MRO suspended vros on duplicate passbook in Guntur

కొనసాగుతోన్న కార్మికుల ఆందోళన:

గుంటూరు పట్టణంలోని భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. యాజమాన్యం జూల్ మిల్లును లాకౌట్ చేయడంతో కార్మికులు రోడ్డున పడ్డ సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పని లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

దీంతో జూట్‌మిల్లు కార్మికుల పరిరక్షణ సమితి నేతలు ఆందోళన చేస్తున్న కార్మికులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. జూట్‌మిల్లు తెరిపించే వరకు కార్మికుల కుటుంబాలకు జూట్‌మిల్లు కార్మికుల పరిరక్షణ సమితి అండగా ఉంటుందని సమితి నేతలు స్పష్టంచేశారు.

English summary
MRO suspended vros on duplicate passbook in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X