ముంబై మోడల్ దోపిడీ: వ్యభిచారం నడిపే స్త్రీ అరెస్టు
హైదరాబాద్: ముంబై మోడల్ను దోచుకున్న కేసులో పోలీసులు ప్రగతి సాధించారు. ముంబై మోడల్ సుబ్రతా దత్తాను సికింద్రాబాదులోని కార్ఖానాకు చెందిన ఓ వ్యక్తి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఇక్కడికి రప్పించి, మద్యం తాగించి, ఆమె ఆభరణాలును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన గురువారంనాడు జరిగింది.
ఈ కేసులో శుక్రవారంనాడు పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమె వ్యభిచారం రాకెట్ను నడుపుతన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రీతి అనే ఆ మహిళను విచారించినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తుందని పోలీసులు గుర్తించారు.
సుబ్రతా దత్తను కూడా వ్యభిచారంలోకి దించాలని ఆ మహిళ ప్రయత్నించిందని, అయితే అది కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. సుబ్రతా దత్తాను దోచుకున్న వ్యక్తి రాజు ప్రితీ అనుచరుడని పోలీసులు చెబుతున్నారు.
మద్యం తాగించి, రాజు అనే వ్యక్తి ముంబై మోడల్ను దోచుకున్నాడు. ఈ విషయంపై సుబ్రతాదత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. సికింద్రాబాదులోని గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.