వివాహేతర బంధం?: బ్యూటీషియన్ కాళ్లు, చేతులు కట్టేసి కత్తులతో దాడి చేశారు
విజయవాడ: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యూటిషియన్పై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. ఆమె చేతులను నరికేశారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే స్థానికులకు గమనించి ఆమెను హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని పద్మగా పోలీసులు గుర్తించారు.
అయితే, బ్యూటిషియన్ పద్మ గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటూ.. ప్రసాద్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ యువకుడితోనే బాపుల పాడులో నివాసముంటోంది.
ఈ క్రమంలోనే ఆమెపై హత్యాయత్నం జరగడంతో.. యువకుడితో వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని బంధువులతోపాటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడే దాడి చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.