తాకట్టు పెట్టిన నగలతో జూదమాడిన బ్యాంకు మేనేజర్! ఓడిపోయి, ఆపైన...
చిత్తూరు: కస్టమర్లు తాకట్టుపెట్టిన నగలను జాగ్రత్తగా భద్రపరచాల్సిన ఓ బ్యాంక్ మేనేజర్ వాటిని జూదంలో పెట్టి, పోగొట్టుకుని, ఎవరికీ అనుమానం రాకుండా వాటి స్థానంలో గిల్టు నగలుంచిన ఉదంతమిది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వి.కోటలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచి మేనేజర్గా పనిచేస్తున్న ప్రకాశ్కు క్రికెట్ బెట్టింగ్ పిచ్చి ఉంది. ఈ నేపథ్యంలో అతడు తన బ్రాంచిలో కస్టమర్లు తాకట్టు పెట్టిన 2 కేజీల బంగారు నగలను క్రికెట్ బెట్టింగ్లో ష్యూరిటీగా పెట్టాడు.
దురదృష్టవశాత్తు ఆ బెట్టింగ్లో ప్రకాశ్ ఓడిపోయాడు. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఆ నగల స్థానంలో గుట్టుచప్పుడు కాకుండా గిల్టునగలు పెట్టాడు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.