అన్నింట అనుకూలం: రాజధాని రేసులో నాగార్జునసాగర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఏర్పాటైన కమిటీ విశాఖపట్నం, కర్నూలు, దొనకొండ (ప్రకాశం జిల్లా), హనుమాన్ జంక్షన్ (కృష్ణా) తదితరాలను పరిశీలిస్తున్నారు. వీటితో పాటు గుంటూరు జిల్లాలో గల నాగార్జున సాగర్ను కూడా పరిశీలిస్తున్నారు.
నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే అన్నింటి పరంగా బాగుంటుందని డిటిసిపి అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాంతం మధ్యన ఉంది. రాజధానికి అవసరమైన నీటి కొరత ఉండదు. అలాగే ఇప్పటికే ఉన్న రన్ వే కండిషన్ కూడా బాగుంది. ఇలా పలు కోణాల్లో ఆలోచిస్తే నాగార్జున సాగర్ రాజధానిగా బెట్టర్ అంటున్నారు.
విశాఖపట్నం, కర్నూలు, దొనకొండలలో రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ప్రాంతాల్లో కొన్ని డిస్ అడ్వంటేజెస్ ఉన్నాయని కొందరు చెబుతున్నారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరమైనప్పటికీ... భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండదని, భారీగా వర్షాలు కురిస్తే కర్నూలు జలమయమై, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దొనకోండ బ్యాక్ వర్డ్ అని చెబుతున్నారు. కొత్త రాజధాని కోసం కమిటీ భారీ కసరత్తు చేస్తోంది.